Wednesday, 15 May 2024 02:24:21 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఏపీని వీడని వానలు.. మరో అల్పపీడనం ముప్పు.. 3 రోజుల పాటు రెయిన్ అలెర్ట్

Date : 14 December 2022 05:14 PM Views : 320

తాజా వార్తాలు / అమరావతి : మాండూస్ తాలూకు బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు జనం. మాయదారి తుఫాను ఎంత పని చేసింది... ఎన్ని బతుకుల్ని ఛిద్రం చేసిందో లెక్కే లేదు. తాజాగా మరో అల్పపీడనం ముప్పు ఉందని అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ.మండూస్ తుఫాన్ తీరం దాటి బలహీనపడినప్పటికీ ఆ ప్రభావం ఇంకా ఏపీలో కనిపిస్తోంది. ఇప్పుడు మరో అల్పపీడన ముప్పు ముంచుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ టోపోస్పిరిక్ ఆవరణములో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం దానికి అనుకుని ఉన్న మలక్కా, సుమత్రా జలసంధి వద్ద గల ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఉన్న హిందూమహాసముద్రం మీద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా పశ్చిమ దిశగా శ్రీలంక తీరం వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది.మాండూస్ కారణంగా ఏపీకి తీవ్ర నష్టం.. ఏపీని కూడా పట్టుకు పీడించింది మాండూస్ తుఫాను. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నష్టం తీవ్రంగా ఉంది. పుత్తూరు, నగరిలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు మంత్రి రోజా. తడుకు వద్ద అండర్ బ్రిడ్జిలో వరద నీరు నిలిచిపోవడంతో జేసీబీ సాయంతో పనులు చేపట్టారు. అటు…పుత్తూరు రైల్వే స్టేషన్ వద్ద వర్షం తాకిడికి ఇళ్లు కూలిపోయాయి. తిరుపతి-తిరుమల క్షేత్రాన్ని వణికించేసింది తుపాను తాకిడి. భారీ వర్షంలోనే తడుస్తూ దర్శనానికి వెళ్లారు శ్రీవారి భక్తులు. కొండ మీద నుంచి కుండపోతగా వచ్చిన నీటితో నిండా మునిగింది కపిల తీర్థం. భారీ వర్షంతో రైతులకు అపార నష్టం మిగిలింది. పొలాల్లో ఆరబోసుకున్న వరి ధాన్యం తడిసి ముద్దయిపోవడంతో లబోదిబోమంటున్నారు కాకినాడ రైతులు. నంద్యాల, మహానంది, గోస్పాడు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. తక్షణమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని దీనంగా వేడుకుంటున్నారు. వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టింది ఏపీ సర్కార్. తుఫాన్‌పై ప్రత్యేక సమీక్ష చేపట్టి.. కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. సీఎం ఆదేశాలు మేరకు భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టారు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని సీఎం హామి ఇచ్చారు. దీని ప్రభావం నుంచి ఇప్పుడిపపుడే బయటపడుతుంటే.. ఈ లోపే మరో అల్పపీడనం ముప్పు ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :