తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ఆదేశానుసారంగా పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపు మేరకు, విజయనగరం డీసీసీ సరగడ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో, రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్, ఎచ్చెర్ల నియోజకవర్గం ఇన్చార్జి కొత్త కోట్ల సింహాద్రి నాయుడు నాయకత్వంలో 75వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆజాద్ కీ గౌరవ్ యాత్ర ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్లు చేయాలన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకి ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముందుగా దువ్వాన పేట లో ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది.అనంతరం కోష్ట జంక్షన్ దగ్గర నుండి పల్లిపేట,కంబాలపేట ,బంటుపల్లి,నాడుకుదిటి పాలేం, కమ్మసిగడాం, కొండములగాం,అడపా పేట,ముక్తుం పురం మీదుగా ఎస్.వి. కోలని, జే.ఆర్.పురం గ్రామాం వరకు సుమారు 25 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ , రాజాం నియోజక వర్గం ఇంచార్జి కంబాల రాజవర్ధన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.లక్ష్మీ,ఎచ్చెర్ల నియోజకవర్గం మండలాల అధ్యక్షులు కె.జోగినాయుడు, ఎ.జగదీష్ నాయుడు,వై.సూర్యనారాయణ,కె. పున్ని నాయుడు,యం.గణేష్,బి.రాములు,కె.జనార్ధన,బి.భాస్కరరావు, రాజాం నియోజకవర్గం మండల అధ్యక్షులు డోల దేశి నాయుడు,నెల్లిమర్ల నియోజకవర్గ మండల అధ్యక్షులు చిలక రాజు, టి.సూరిబాబు,రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin