తాజా వార్తాలు / హైదరబాద్ : క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్ వచ్చిందంటే పండగే.. ఎంత ఖరీదైనా పెట్టి టికెట్ కొని స్టేడియంకి వెళ్లి మ్యాచ్ చూడాలనుకుంటారు. అవకాశం లేనివాళ్లు ఇంట్లో టీవీలోనో, మొబైల్లోనో చూసి ఎంజాయ్ చేస్తారు. ఇక స్టేడియంలో చూసేందుకు చాన్స్ దొరికిన వాళ్ల ఆనందానికి అవధులుండవు. అరుపులు, కేరింతలతో తమ టీమ్స్ ను సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చక్కగా టికెట్ కొనుక్కొని స్టేడియంకి వెళ్లి కూడా స్టేడియంలో తన ఎదురుగా జరుగుతున్న మ్యాచ్ ను ఫోన్ లో చూస్తూ కనిపించాడో వ్యక్తి.ఒక పక్క స్టేడియంలో జనాలు తమ అభిమాన క్రికెటర్లను చూసి కేరింతలు కొడుతుంటే.. ఇంకోపక్క ఖాళీగా ఉన్న సీట్ల వెతుక్కుని, హాయిగా పడుకుని, ఫోన్ లో మ్యాచ్ చూశాడీ వింత మనిషి. మొన్నటి సీఎస్కే, ఢిల్లీ మ్యాచ్ లో జరిగిందీ ఘటన.
-----------------------
Admin