తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లాః 1) టెక్కలి మండలం నరసింగపల్లి పంచాయితీ జగన్నాధపురం ఏడో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధి పావని 124 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 219 ఓట్లు గాను 156 ఓట్లు పోలయ్యాయి. ఇదులో వైసీపీ బలపరచిన అభ్యర్ధి పావనికు 124 ఓట్లు రాగా టీడీపీ బలపరిచిన అభ్యర్ధి సింగపురం మోహినికు 28 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. 2) నరసన్నపేట మండలం కొమర్ధిలో వైసీనీ బలపరిచిన అభ్యర్ధి, లబ్బ రాజారావు 24 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ బలపరిచిన అభ్యర్ధికి 50 ఓట్లు రాగా వైసీపీ బలపరచిన అభ్యర్ధికి74 ఓట్లు వచ్చాయి. 3) సారవకోట మండలం బద్రి సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్ధి మజ్జి అసిరమ్మ గెలుపు సాధించారు. 4) నందిగాం మండలం అన్నపురం పంచాయితీ సర్పంచ్ పదవికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్ధి బర్నాన ఇంద్రవేణి 89 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 775 ఓట్లుకు 633 ఓట్లు పొలయ్యాయి. ఇందులో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్ధి ఇంద్రవేణికు 353, టీడీపీ బలపర్చిన అభ్యర్ధి బర్నాన తిరుపతిరావుకు 264 ఓట్లు వచ్చాయి. 5) బూర్జ మండలం పెదలంకాం సర్పంచ్ ఎన్నికల్లో వైసీసీ బలపరిచిన అభ్యర్ధి కాకితాపల్లి గోవిందరావు గెలుపు సాధించారు.
-----------------------
Admin