తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : పండుగ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్ల మీదుగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆ వివరాలు మీ కోసం.మచిలీపట్నం-కర్నూలు, మచిలీపట్నం-తిరుపతి, విజయవాడ-నాగర్సోల్, కాకినాడ టౌన్-లింగంపల్లి, పూర్ణ-తిరుపతి, తిరుపతి-అకోలా, మచిలీపట్నం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు వివరించారు. మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ (07067 రైలు )కి ప్రతీ శనివారం, మంగళవారం, గురువారం నడుస్తుంది. 2022 జనవరి 3,5,7,10, 12, 14, 17న మచిలీపట్నం నుంచి బయల్దేరుతుంది. మచిలీపట్నం, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, నరసారావుపేట, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంబం, గిద్దలూరు, నంద్యాల, డోన్ స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నం వరకు ప్రతీ ఆదివారం, బుధవారం, శుక్రవారం వెళుతుంది. 2022 జనవరి 4, 6, 8, 11, 13, 15, 18న నడుస్తుంది.
-----------------------
Admin