తాజా వార్తాలు / అమరావతి : CM Jagan: నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి.. ఇదే లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్ శాఖలు కలిసి పని చేయాలన్న సీఎం జగన్CM Jagan Mohan Reddy రాష్ట్రంలో ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పనితీరు పైన సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా మారాలని ఆదేశించారు. ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దు.. ఆ లక్ష్యంతోనే పని చేయాలంటూ పోలీస్, ఎక్సైజ్ శాఖలు కలిసి పని చేయాలంటూ ఆయన సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఈబీ సమీక్ష సందర్భంగా.. నార్కొటిక్స్తో పాటు అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడం, మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం.. యాప్లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడం.. ఈ నాలుగింటిపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
-----------------------
Admin