తాజా వార్తాలు / అమరావతి : రణస్థలం, రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామంలో ఈ నెల 26న అంబేద్కర్ ఆలయం ఆవిష్కరణ మహోత్సవం జరగనున్నట్లు (ఏ.ఐ.ఎమ్) శ్రీకాకుళం డివిజన్ ఇన్చార్జ్ దువ్వాన అప్పలసూరి మాష్టర్ గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలయ ఆవిష్కరణ కార్యక్రమం అంతా అంబేద్కర్ ఇండియా మిషన్ (ఏ.ఐ.ఎమ్) ఆధ్వర్యంలో జరుతుందని, ఈ కార్యక్రమానికి ఏ.ఐ..ఎమ్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ఐ.పి.ఎస్ ఏపీ ఎడిషనల్ డి.జి.పి పి.వి.సునీల్ కుమార, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్ల కిరణ్కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొనున్నారు. అలాగే శ్రీకాకుళం ఎస్.పి రాధిక, ఆర్.డి.ఓ బడ్డేపల్లి శాంతి, రణస్థలం మండల నాయకులు, ఏ.ఐఎమ్ జిల్లా నాయకులు, వివిధ సంఘాల నాయకులు, మహిళలు, బహుజన వాదులు, అంబేద్కర్ వాదులు, కార్మిక, కర్షక సోదరులు పాల్గొన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
-----------------------
Admin