తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ప్రస్తుతం ఎక్కడ చూసిన గాడ్ ఫాదర్ హడావిడే కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించి అలరించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నయనతార నటించి అలరించారు. ఇక ఈ సినిమాలో సత్య దేవ్ , సునీల్ , సముద్రఖని, అనసూయ ఇతర ముఖ్యపాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ సినిమా తర్వాత.. సైరా నరసింహారెడ్డి, ఆచార్య సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి.ఇటీవల దురంతో ఎక్స్ప్రెస్ లో ఎచ్చెర్ల నియోజకవర్గం పున్నాం పంచాయతీ చెందిన సత్యవతి అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో అదే ట్రైన్లో ప్రయాణం చేస్తున్న విశాఖకు చెందిన గీతం కాలేజ్ విద్యార్ధి వైద్య విద్య అభ్యసిస్తున్న K.స్వాతి రెడ్డి అత్యవసర వైద్యసేవలు ట్రైన్ లోనే అందించి ప్రసవం చేసిన విషయం అందరికి విదితమే. ఇంత సహాసం చేసిన గీతారెడ్డిని ముందుకు టీడిపి సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పలనాయుడు ఆమెను అభినందించడమే కాకుండా ఆ విద్యార్ధిని ప్రొత్సహిస్తూ ఎచ్చెర్ల నియోజకవర్గం పున్నాం పంచాయతీ గ్రామస్థుల ఆధ్వర్యంలో గీతారెడ్డికి G. సిగడాం మండలం మాజీ ఎంపీపీ బాలబొమ్మ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఘనంగా సన్మానకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలిశెట్టి మాట్లాడుతూ మానవతా దృక్పధంతో అత్యవసర సమయంలో తల్లి బిడ్డల ప్రాణాలు కాపాడిన స్వాతి ని అభినందిస్తున్నానని అదే విధంగా అత్యవసర సమయం లో అండగా ఉన్న వైద్య విద్యార్థిని స్వాతి రెడ్డి ని జీవితాంతం గ్రామ ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు.. ఈ సందర్భంగా స్వాతి రెడ్డికి కలిశెట్టి అప్పలనాయుడు స్టెతస్కోప్ బహుకరించారు.
-----------------------
Admin