తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం,సెప్టెంబర్,14: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయముల సంస్థలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి జి. గ్రేస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 4 పోష్టులు ఖాళీలు ఉండగా అందులో పురుషులకు జూనియర్ లెక్చరర్ల జువాలజీ కంచిలిలో మహిళలకు, నందిగాంలో TGT PS, మందసలో TGT PS, పాతపట్నంలో TGT BS పోష్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. బాలికల పాఠశాల/కళాశాలలలో మహిళలను మాత్రమే నియమించబడుతుందన్నారు, బాలురు పాఠశాల/కళాశాలలో పురుషులు మాత్రమే నియమించబడునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నడుపబడుచున్న డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలకు 2022-2023 వ విద్యా సంవత్సరమునకు గాను ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ నిమిత్తం వాక్ ఇన్ ఇంటర్వ్యూ, డెమో ద్వారా గెస్ట్ ఉపాధ్యాయులను ఎంపిక నిమిత్తం ఆశక్తి గల అభ్యర్థులు వారి యొక్క బయోడేటా తో పాటు P.G. B.ED, TET (క్వాలిఫైడ్) ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు నేరుగా అభ్యర్థులు జిల్లా సమన్వయాధికారి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయముల సంస్థ, ఆదివారంపేట, శ్రీకాకుళంకు తేదీ 17.09.2022న ఉదయం 10.00 గం. నుండి మధ్యాహ్నం 01.00 గం నిర్వహించబడు డెమోకు హాజరు కావలసినదిగా ఆ ప్రకటనలో కోరారు. పూర్తి సమాచారం కొరకు 08942-279926, 9701736862, 9963064066 ఫోన్ నంబర్లు కు సంప్రదించవలెనని తెలిపారు.
-----------------------
Admin