తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : సేంద్రియ వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించవచ్చని రణస్థలం మండలం కొండములగాం పంచాయితీ ఎంపీటీసీ ప్రతినిధి మరియు వైకాపా నాయకులు రెడ్డి వాసు అన్నారు. సేంద్రియ వ్యవసాయంపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని దూరంచేసేందుకు స్వయంగా ఆయన సోంత స్థలంలోని సుమారు 10 సెంట్లుల్లో 36 రకాల సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రశాంత్ మాట్లాడుతూ ఈ 36 రకాలు సుమారు ఏడాది సరిపడా పౌష్టిక ఆహారం తయారు చేసుకునేవిధంగా ఉంటుందని ఆమె రైతులకు వివరించారు. అలాగే దుంపజాతి , తీగజాతి, ఆకుకూరలు , కాయగూరలు, బహువరశిక కంది, జొన్న మరియు చిన్న పళ్ళు జాతులు , పెద్ద పళ్లు జాతులు ఇలా ఏడు అంతస్తులుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం జరుగుతుంది . ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సబ్ డివిజనల్ యాంకర్ , గంట్యాడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin