తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో జనసేన యువశక్తి సభను విజయవంతం చేసిన జనసైనికులకు, అభిమానులకు, ఇతర నేతలకు మీడియా మిత్రులకు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు అర్జన్ భూపతి కృతజ్ఞతలు తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల పై యువశక్తి వేదికగా జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశ నిర్దేశం చేసారని తెలిపారు. పవన్ బహిరంగ సభకు విచ్చేసిన జనసైనుకులు చూసి అధికార పార్టీ నాయకులలో దడ మొదలైందని తెలిపారు. అలాగే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుపై ఆయన విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించే హక్కు దువ్వాడకు లేదని తెలియజేశారు. విశాఖలో విలువైన 25వేల కోట్లు విలువైన భూములను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెడితే మంత్రి అమర్నాథ్ నోరు మెదపడేమని ప్రశ్నించారు. పవనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఉరుకోపమని ఆయన గాటుగా హెచ్చరించారు. ఆయనతో పాటు జనసేన నాయకులు దన్నాన చిరంజీవి, బొంతు విజయ కృష్ణ ఉన్నారు.
-----------------------
Admin