Wednesday, 15 May 2024 12:36:04 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

బీజేపీ, జనసేన మధ్య కటీఫ్‌? సంచలన కామెంట్స్ చేసిన మాధవ్

Date : 21 March 2023 09:23 PM Views : 116

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అని బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్‌ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది.ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అని బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్‌ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అవును, బీజేపీ, జనసేన మధ్య చెడినట్టే కనిపిస్తోంది. పొత్తులున్నా తమతో కలిసి జనసేన పనిచేయకపోవడంపై బీజేపీ గుస్సా మీదున్నట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాయమడిగినా చేయలేదని జనసేనపై విమర్శలు సంధిస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ పదాధికారుల సమావేశం తర్వాత ఆ పార్టీ నేత మాధవ్‌ చేసిన హాట్‌ కామెంట్స్.. ఇప్పుడు కాకరేపుతున్నాయ్‌.ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్‌ కోసం పవన్‌ని అడిగామనీ.. అయితే, జనసేన నుంచి ఎలాంటి స్పందనా రాలేదనీ చెప్పారు మాధవ్‌. పొత్తుల విషయంలో చాలా ఆలోచలున్నాయని చెప్పిన ఆయన.. బీజేపీ ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటోందనీ తెలిపారు. ఏపీ బీజేపీలో కీలకనేతగా ఉన్న మాధవ్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంతేకాదు.. మాధవ్ వ్యాఖ్యలతో ఈ రెండు పార్టీలు బ్రేకప్‌ చెప్పేసుకుంటున్నాయనే చర్చ మొదలైందిప్పుడు. మగళవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష తర్వాత మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ-జనసేన పార్టీల పొత్తులపై కీలక కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేయలేదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఉత్తరాంధ్రతో పోల్చితే రాయలసీమలోనే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారాయన. అంతేకాదు.. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక వైసీపీతో కలిసి బీజేపీ పనిచేస్తుందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోందన్న మాధవ్.. ఈ ప్రచారాన్ని ఖండించారు. అలాంటి పొత్తులేమీ లేవని తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఓటమిని పక్కనపెడితే మిగిలిన చోట్ల గతంలో కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లే వచ్చాయని అన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :