Tuesday, 14 May 2024 03:47:30 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

తమిళనాడును వణికిస్తున్న “మద్రాస్ ఐ”.. ఈ వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయి..

Date : 21 November 2022 06:07 PM Views : 210

తాజా వార్తాలు / అమరావతి : తమిళనాడు ప్రజలను మద్రాస్‌ ఐ వణికిస్తోంది. ఆస్పత్రులన్నీ కళ్లకలక బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 2వందల నుంచి 250మంది వరకు చికిత్స పొందుతున్నారు. మదురైలో మద్రాస్‌ ఐ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ ఫస్ట్‌ నుంచి అధిక వర్షాలతో ఈ వ్యాధి విజృంభిస్తోంది. కళ్లమంట, దురద, కళ్లు ఎర్రగా మారడం, నీరు కారడం, కనురెప్పులు అంటుకుపోవడం, కళ్లు తిరగడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రోజూ 4,500 మంది కంటి సమస్యలతో చికిత్స పొందుతున్నారని, ఇప్పటి వరకు లక్షన్నర మందికి ట్రీట్‌మెంట్‌ అందించినట్టు తెలిపారు. కంటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారు సరైన వ్యైద్యం తీసుకోవాలని..అలాగే ఇది అంటువ్యాధి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఈ వైరస్ సోకిన వారు నాలుగు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జ్వరం, జలుబు, దగ్గుతో పాటు అంటువ్యాధులు పెరిగిపోతున్నాయి. అలాగే దోమల బెడదతో డెంగ్యూ విజృంభిస్తోంది. దీని నివారణకు తమిళనాడు ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తోంది. ఐతే కళ్ళకలక ఈ సీజన్‌లో వచ్చే సాధారణ వైరసే అయినా రాష్ట్రమంతటా వ్యాపించడం ప్రభుత్వాన్ని కూడా కలవరపెడుతోంది. దీంతో మద్రాస్‌ ఐ నియంత్రణకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కంటి వ్యాధి మీకు మద్రాసు కంటి వ్యాధి ఉంటే, మీ కళ్ళు ఎర్రగా, చికాకు మరియు దురదగా మారుతాయి. నీళ్ళు నిండిన కళ్ళు. కాబట్టి ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులు వారు ఉపయోగించిన వస్తువులను ఉపయోగించకూడదు. కళ్లలో ఇలాంటి సమస్య ఉంటే సొంతంగా మెడికల్ షాపుకు వెళ్లి కంటి చుక్కలు వేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అంటు వ్యాధి కంటి వ్యాధి అంటు వ్యాధి కాబట్టి అతన్ని వేరుచేయడం అవసరం. అతను ఉపయోగించిన ఉత్పత్తులను ఎవరూ ఉపయోగించకూడదు. మీ చేతులను తరచుగా సబ్బుతో కడగాలి. ఎవరినీ కళ్లతో చూడకండి. డార్క్ గ్లాసెస్ ధరించాలని వైద్యులు సూచించారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :