Tuesday, 14 May 2024 08:06:38 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

నిప్పుల వర్షం కురిపిస్తున్న సూరీడు.. ఏపీలో 13కి చేరిన వడదెబ్బ మృతుల సంఖ్య..

Date : 17 May 2023 03:26 PM Views : 140

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిలా మారింది. బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలో వడదెబ్బతో.పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిలా మారింది. బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వడదెబ్బ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలో వడదెబ్బతో 12 మంది మరణించగా. తాజాగా ప్రకాశం జిల్లాలో మరొకరు వడదెబ్బతో మరణించారు. దీంతో ఏపీలో వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య 13కి చేరింది. ప్రకాశం జిల్లాలోని కంభం పట్టణంలో వడదెబ్బకు గురై కొండేటి గురవయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.కంభం పట్టణంలో నడిచి వెళ్తూ గురవయ్య అకస్మాత్తుగా కుప్పకూలాడు. స్థానికులు గురువయ్యను హుటాహుటిన కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువయ్యను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. వడదెబ్బ వల్లే గురవయ్య మృతి చెందినట్లు వెల్లడించారు. గురువయ్య బేల్దారిగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో గురువయ్య కుటుంబంలో విషాదం నెలకొంది.కాగా.. ఎండలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు భగ భగ మండిపోతున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దారవీడులో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. నెల్లూరులో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :