Tuesday, 14 May 2024 04:05:03 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

చంద్రబాబు, పవన్‌ల గేమ్‌ ప్లాన్‌.. ఏపీలో ‘ముందస్తు’ ఎన్నికలపై తేల్చేసిన సజ్జల

Date : 06 July 2023 09:02 PM Views : 111

తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతోన్న ప్రచారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ముచ్చటే లేదని ఆయనే తేల్చిచెప్పేశారు. ‘మాకు ముందస్తుకు పోవాలనే ఆలోచన లేదు. ఇదంతా ప్రత్యర్థులు చేసే హడావిడి తప్ప మరేం కాదు. ప్రజలు ఇచ్చిన 5 ఏళ్ల పాలన పూర్తి చేశాకే వెళతాం. రాష్ర్ట ప్రజానీకం అశీర్వచనాలతోనే ఎన్నికలకు రెడీ అవుతాం. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్‌ కల్యాణ్‌ ముందస్తు కావాలని కోరుకుంటున్నారు. మాకు మాత్రం పూర్తి సమయం అవసరం. సీట్లు, ఓట్ల కోసం చంద్రబాబు, పవన్‌ ఆడుతున్న గేమ్‌ ప్లాన్‌లో ఇది భాగం. ముందస్తు అంటే మా దగ్గర నుంచే వస్తుంది. పవన్ ను ఒప్పించుకోవడానికి చంద్రబాబు ముందస్తు ప్రచారం. దీనికి తగ్గట్టుగానే కొన్ని పార్టీలు కొన్ని మీడియా సంస్థలు చేసే హడావిడి చేస్తున్నాయి. ఐదేళ్లు పాటు ఆఖరి రోజు వరకూ పూర్తిగా వినియోగించుకుంటాం. వైసీపీకి పూర్తి సమయం అవసరం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి’ అని సజ్జల పేర్కొన్నారు.ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై స్పందించారు సజ్జల ‘ జగన్‌ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా నిర్మాణాత్మకంగా వెళ్తున్నారు. సానుకూల ఫలితాలు వస్తున్నాయి. జగన్ పాజిటివ్ ఓట్ ను మాత్రమే నమ్ముకున్నారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. రాష్ట్ర వాటాలతోనే పనులు జరుగుతాయి. రాజధాని ప్రాంతంలో ఇళ్ళు కట్టవద్దు అని కోర్ట్ చెప్పలేదు’ అని సజ్జల పేర్కొన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :