Tuesday, 14 May 2024 12:37:57 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

Date : 24 November 2022 11:19 AM Views : 205

తాజా వార్తాలు / అమరావతి : సైన్స్ విషయంలో మాత్రం భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు రెండు వేర్వేరు పేపర్లుతో పరీక్ష నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నలను రెండు వేర్వేరు విభాగాలుగా ఒకే ప్రశ్న పత్రంలో ఇవ్వనున్నారు.పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి టెన్త్ లో 6 పేపర్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి సబ్జెక్టుకు ఒక పేపర్‌ చొప్పున కేవలం ఆరు పరీక్షలే నిర్వహించనున్నారు. ఈమేరకు సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు, హిందీకి ఒక పేపర్‌ చొప్పున మొత్తం 11 పేపర్లకు పరీక్షలు నిర్వహించేవారు. అయితే కరోనా నేపథ్యంలో వాటిని ఏడింటికి కుదించారు. అయితే సైన్స్ విషయంలో మాత్రం భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు రెండు వేర్వేరు పేపర్లుతో పరీక్ష నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నలను రెండు వేర్వేరు విభాగాలుగా ఒకే ప్రశ్న పత్రంలో ఇవ్వనున్నారు. అయితే ఆన్సర్‌ బుక్‌లెట్లు మాత్రం రెండూ ఇవ్వనున్నారు. ఒక దానిలో భౌతికశాస్త్రం, మరో దానిలో జీవశాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ రెండు సబ్జెక్టుల పేపర్లను వేర్వేరుగా పీఎస్‌, బీఎస్‌ టీచర్లు మూల్యాంకనం చేయాల్సి ఉన్నందున రెండు వేర్వేరు ఆన్సర్‌ బుక్‌లెట్లు ఇవ్వనున్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :