తాజా వార్తాలు / అమరావతి : ఏపీలో పేదలకు శుభవార్త వచ్చేసింది.. రేషన్ షాపుల్లో కొత్తగా పేదలకు గుడ్ న్యూస్.. రేషన్ షాపుల్లో కొత్తగా 2 వస్తువులు.. మీ ఆరోగ్యం కోసమేAndhra Pradesh Ration ఆంధ్రప్రదేశ్లోని బడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కింద బియ్యంతో పాటు… చిరుధాన్యాలను ఇవ్వాలని భావిస్తోంది. ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఐక్యరాజ్యసమితి 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం కూడా చిరు ధాన్యాలను ప్రొత్సహించేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు రాష్ట్రాలకు కూడా తగిన సూచనలు చేసింది. జొన్నలు, రాగులు వంటి వాటిని సప్లై చేసే విధంగా ముందుకు వెళ్లాలని ఆదేశించింది. కరోనా అనంతరం అందరూ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇమ్యూనిటీ ఇచ్చే ఫుడ్స్ తీసుకుంటున్నారు. రైస్కు అలవాటు అయినవారు ఈ ఫుడ్స్ తీసుకోవడం కష్టమే. కానీ కొద్దికొద్దిగా అలవాటు చేసుకుంటే మంచింది. ఇప్పటికే చాలామంది దంపుడు బియ్యం తింటున్నారు. జొన్న అన్నం తినేవారు సైతం పెరిగారు. ఈ క్రమంలో ఏపీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్.. వివిధ జిల్లాల్లో ఎంతమేర చిరు ధాన్యాలు పండిస్తున్నారనే వివరాలు సేకరిస్తుంది. ఎంతమంది ఈ ఫుడ్ తినేందుకు సుముఖంగా ఉన్నారో సర్వే చేపట్టబోతుంది. ఆ తర్వాత డిమాండ్ను బట్టి నిర్ణయం తీసుకోనుంది. అంతా వర్కువట్ అయితే ఒక్కో రేషన్ కార్డుకు 2 కేజీల జొన్నలు, రాగులు ఇవ్వాలని భావిస్తోంది. బియ్యాన్ని 2 కిలోలు తగ్గించి.. బదులుగా 2 కిలోల రాగులు, జొన్నలు తీసుకునేలా అవగాహన కల్పిస్తుంది. ఇప్పటికే చిరుధాన్యాల ప్రయోజనాల ఏంటో వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని పౌరఫరాలశాఖ ముందుకు తీసుకెళ్తుంది. పేదలకు చిరుధాన్యాల పంపిణీపై సర్వే జరుగుతోందని.. ఈ వారంలో ఇది కంప్లీట్ అవుతుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వివరించారు.
-----------------------
Admin