Tuesday, 14 May 2024 03:45:00 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

మాజీ చీఫ్ మళ్లీ చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారా? రాహుల్ పాదయాత్రే వేదిక కానుందా?

Date : 12 October 2022 09:43 AM Views : 221

తాజా వార్తాలు / అమరావతి : న్నాళ్లు రాజకీయాలకు పూర్తిగా దూరమై, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మళ్లీ పొలిటికల్‌గా యాక్టీవ్ అవుతారా? ఖద్దర్ ధరించి.. చక్రం తిప్పుతారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అందుకు నిదర్శనంగా తాజాగా ఆయన చేసిన కామెంట్స్‌ను చూపుతున్నారు. అవును, ఏపీ మాజీ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత రాజకీయాలపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈనెల 14న రాహుల్ పాదయాత్ర తర్వాత రాజకీయాలపై చర్చించుకుందామని గ్రామస్తులతో జరిగిన సమావేశంలో చెప్పారు రఘువీరా. ముందుగా రాహుల్ పాదయాత్రలో మన ప్రాంతం నుంచి భారీగా వెళ్లి మన సంపూర్ణ మద్దతు తెలియజేద్దామని గ్రామస్తులతో అన్నారాయన. అంతేకాదు ఊళ్లోని దేవాలయం నుంచి రాహుల్ గాంధీకి ప్రసాదం అందిద్దామని గ్రామస్తులకు చెప్పారు. వారం పది రోజుల్లోనే రాజకీయాల ఎంట్రీపై ఒకటే నిర్ణయం తీసుకుందామని అనుచరులు, గ్రామస్తులతో రఘువీరా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధ్మాత్మికంగా తనకు ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పారు. మడకశిర దేవస్థానంలో చేసిన..కొన్ని నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు రఘువీరారెడ్డి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయమంత్రిగా, తర్వాత ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సీనియర్ నేత నీలకంఠాపురం రఘువీరారెడ్డి. అయితే 2019 ఎన్నికలకు ముందే రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని తన స్వగ్రామం నీలకంఠాపురంలోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సాదారణ రైతులగా గడుపుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా రఘువీరా చుట్టూ రాజకీయాలు చుట్టుముట్టాయి. రాహుల్ పాదయాత్రలో పాల్గొంటానని చెప్పడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బాస్ ఈ బ్యాక్ అనే డైలాగులు మారుమోగుతున్నాయి. ఈ ప్రచారాలకు రాహుల్ పాదయాత్ర తర్వాత ఫుల్‌స్టాప్ చెబుతారా.. రీఎంట్రీ ఇస్తూన్నానంటూ సంచలన ప్రకటన చేస్తారో చూడాలిమరి.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :