Tuesday, 14 May 2024 03:36:28 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

చివరి అవకాశం నాకు కాదు.. ప్రజలకే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

Date : 30 November 2022 06:21 PM Views : 333

తాజా వార్తాలు / ఏలూరు : ‘‘చివరి అవకాశం నాకు కాదు.. ప్రజలకు.. ఇప్పుడైనా ప్రజలంతా కళ్లు తెరవాలి.. మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం ఉండదు.. నాకేం కొత్త చరిత్ర అవసరం లేదు.. ప్రజల మంచి కోసమే చెబుతున్నా’’.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీలో సీఎంగా చేశానని.. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. తనకు ఎమ్మెల్యే పదవితో పనిలేదని.. రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలని, అందుకు అంతా ధైర్యంగా ముందుకు రావాలని పేర్కొన్నారు. భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుందంటూ చంద్రబాబు తెలిపారు. . ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో.. ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం దిగిపోతేనే ఏపీ రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌.. ప్రజల నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టారని విమర్శించారు. రాష్ట్రం అన్ని రకాలుగా దెబ్బతిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడ చూసినా జనం ఇదేం ఖర్మ అనే పరిస్థితికి వచ్చిందన్నారు. ఆనాడు తాను చెప్పిందే.. ఇవాళ జరుగుతోందని.. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఇప్పుడైనా తన మాట వింటారని ఆశిస్తున్నారని.. ఇప్పుడు కూడా వినకపోతే ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశామని.. జగన్ ప్రభుత్వం రివర్స్‌ టెండర్ పేరిట పోలవరాన్ని గోదావరిలో ముంచేసిందన్నారు. వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్‌ సునీత తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయించడం సీఎం జగన్‌కు చెంపదెబ్బ లాంటిదని చంద్రబాబు విమర్శించారు. ఈ అంశంపై జగన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని లండన్‌ బాబు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :