తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, వరిసాం పంచాయతీ అరోబిందో ఫార్మా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రాం M.Sc చదివిన విద్యార్థులకు ఫార్మాసిటీకాల్ క్వాలిటీ కంట్రోల్ అనలైటికల్ టెక్నిక్స్ శిక్షణ నాలుగు నెలల పాటు చేపట్టారు. ఈ శిక్షణ కాలం ముగిసిన సందర్బంగా 8th బ్యాచ్ 40 మంది విద్యార్థిని & విద్యార్ధులుకు సర్టిఫికెట్స్ ప్రధానోత్వం కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీ UNB రాజు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్పొరేట్ HR డిపార్ట్మెంట్ చేతులు మీదుగా ప్రధానోత్వం సర్టిఫికెట్స్ చేయబడినది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నాలుగు నెలల శిక్షణలో అనుభవజ్ఞలు అయినా అధ్యాపకులచే, అధునాతన యంత్రలతో ఫార్మా & కెమికల్స్ కు అవసరమైన శిక్షణ ఇవ్వడమైనదని మరియు ఈ నాలుగు నెలల శిక్షణ కార్యక్రమం వలన వివిధ ఫార్మా రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి అవకాశం కల్గుతుందని ఆరోబిందో ఫార్మా ప్రతినిధులు తెలిపారు.
-----------------------
Admin