Tuesday, 14 May 2024 02:21:41 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఏపీ రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌! నేటి నుంచి ఉచితంగానే..

Date : 01 January 2023 06:48 PM Views : 232

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు జగన్‌ సర్కార్‌ శుభవార్త తెలిపింది. ఈ నెల నుంచి ఏడాదిపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేయనుంది. అంటే ఇప్పటిదాకా కిలో బియ్యం 1 రూపాయికే అందించిన ఏపీ ప్రభుత్వం జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 1 నుంచి ఉచియ బియ్యం పంపిణీ అమలు అవుతుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ శనివారం (డిసెంబర్ 31) అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై విజిలెన్స్‌ అధికారులు నిఘా పెట్టి, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు కోటి 46 లక్షల రేషన్‌ కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కిందకు వచ్చే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులందరికీ ఏడాదిపాటు ఉచిత బియ్యం అందించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుదారులతో సమానంగా నాన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఏ కార్డుదారులకు కూడా ఉచితంగా బియ్యం అందించనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరైనా ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ 1967కు లేదా 18004250082 నంబర్‌ను సంప్రదించవచ్చని అరుణ్‌కుమార్‌ చెప్పారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :