తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి వద్ద ఉన్న హరేకృష్ణ నగర్ వద్ద శ్రీ కృష్ణ జన్మష్టమి ఉత్సవాలకు రంగం సిద్దమవుతుంది. ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు బృందం రాత్రిపగలు పనిచేస్తుంది. ఈ ఉత్సవాలు ఆగష్టు 19వ తేదిన జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని శ్రీ కృష్ణ జన్మష్టమి ఉత్సవ కమిటీ పిలుపునిచ్చింది. ఆ రోజు కార్యక్రమాలు ఇలా నిర్వహించనున్నారు. కార్యక్రమ వివరములుః 1.19వ తేది ఉదయం 5 గంటలకు మంగళహరతి, 7.30 నిలకు శృంగార హారతి, భాగవత ప్రవచనం, 10 గంటలకు సీతారామ సంగీత బృందం శ్రీకాకుళం వారిచే అన్నమయ్య సంకీర్తనలు ఆలపించబడును. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వెంకట చింతమ్మతల్లి కోలాట బృందం కోష్ఠ వారిచే కోలాటం నిర్వహించబడును. 1.30 నిలకు శ్రీ బంతమ్మతల్లి కోలాటం బృందం పల్లిపేట వారిచే కోలాటం నిర్వహించబడును. 3 గంటలకు భగవతి నృత్య కళామందిర్ విజయనగరం వారిచే కూచిపూడి నాట్య ప్రదర్శన ప్రదర్శించబడును. 3.30 నిలకు ఉట్లోత్సవము. 4 గంటలకు తులసి భారతి. 5 గంటలకు శ్రీ గౌరనితాయి మరియు గోవిందునకు మహా శంఖాభిషేకము నిర్వహించబడును. 6 గంటలకు పుష్పాభిషేకము. 6.15 నిమషాలకు భగవతి నృత్య కళామందిర్, విజయనగరం వారిచే కూచిపూడి నాట్య ప్రదర్శన.6.30 నిమషాలకు మహా ప్రసాద వితరణ జరుగును. కావున భక్తజనులందరు విచ్చేసి శ్రీ కృష్ణ జన్మష్టమి ఉత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహించాలని శ్రీ రాధాగోవింద మందిర సేవా భక్త బృందం కోరుచున్నది. మరెన్ని వివరాలకు 9000379398, 9492417089కు సంప్రదించగలరు.
-----------------------
Admin