Tuesday, 14 May 2024 10:33:16 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు సర్కారు బడుల్లో కొత్త మెనూ.. నేటి నుంచి అమలు

Date : 21 November 2022 11:24 AM Views : 228

తాజా వార్తాలు / అమరావతి : నేటి బాలలే రేపటి పౌరులు.. సర్కారీ బడుల్లో చదువుకునే సమయంలో స్టూడెంట్స్ మంచి ఆరోగ్యంగా ఉండడం పౌష్టికాహారాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడానికి అమలు చేస్తోన్న జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్ ఆదేశాల మేరకు కొత్త మెనూ తయారు చేసి.. నేటి నుంచి అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ‘ గోరుముద్ద ‘ ను ప్రభుత్వం వడ్డించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ ఉత్తర్వు లు జారీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మెనూ వివరాలు: సోమవారం : ప్రస్తుత మెనూ: అన్నం, పప్పుచారు, కోడిగుడ్డుకూర, చిక్కీ ఉండగా.. కొత్తమెనూ : హాట్‌పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు/ కూరగాయల పులావ్, కోడిగుడ్డుకూర, చిక్కీ మంగళవారం : ప్రస్తుతం: చింతపండు/నిమ్మకాయ పులిహోర,టమాట పప్పు, ఉడికించిన కోడిగుడ్డు కొత్తమెనూ: చింతపడు/నిమ్మకాయ పులిహోరా, టమాట పచ్చడి/దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు బుధవారం : ప్రస్తుతం: కూరగాయల అన్నం, బంగళాదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ కొత్తమెనూ: కూరగాయల అన్నం, బంగాళదుంపకుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ గురువారం : ప్రస్తుతం: కిచిడి, టమాటపచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు కొత్తమెనూ: సాంబార్‌బాత్, ఉడికించిన కోడిగుడ్డు శుక్రవారం : ప్రస్తుతం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ కొత్తమెనూ: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ శనివారం : ప్రస్తుత మెనూ: అన్నం, సాంబార్, తీపిపొంగలి కొత్తమెనూ: ఆకుకూర అన్నం, పప్పుచారు, తీపిపొంగలి. ఈ కొత్త మెనూ నేటి నుంచి ఏపీలోని సర్కారు బడుల్లో అమలు కానుంది. విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు పోషకవిలువలతో కూడిన భోజనం అందించనున్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :