తాజా వార్తాలు / అమరావతి : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరంపై ఉగ్రదాడిపై నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. ఈ క్రమంలోనే భారత భద్రతా సంస్థలు రామమందిరంపై దాడికి ప్రకారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. సోమవారం(జనవరి 16)న నిఘా వర్గాలు జారీ చేసిన హెచ్చరికల మేరకు అయోధ్య రామమందిరంపై ఉగ్రవాదులు రెక్కీ చేసినట్టు తెలిసింది. అయోధ్య రామమందిరం దగ్గర జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి కుట్ర చేసినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించేందుకు టెర్రరిస్టులు ప్రయత్నిస్తునట్టు ఐబీ హెచ్చరించింది. నిఘా వర్గాల హెచ్చరికల తరువాత అయోధ్యతో భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే 50 శాతం ఆలయ నిర్మాణం పనులు పూర్తయిన నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే ఏడాది మొదటి నాటికి(జనవరి 1, 2024) అయోధ్య రామమందిర పనులు పూర్తయి, ఆలయం ప్రారంభమవుతుందని ప్రకటించారు.
-----------------------
Admin