తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం: సమాజంలో ఏ వర్గానికి కష్టం, నష్టం వచ్చినా ముందుగా వచ్చి నిలబడేది మీడియా అని, అదే మీడియా సంస్థలు, సంస్థలో పనిచేసే జర్నలిస్టులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని మీడియా సంస్థలను నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, పౌర సమాజంపై ఉందని ఏపిడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజస్థాన్ మౌంట్ అబులో జరిగిన రెండోరోజు నేషనల్ మీడియా కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలోనూ, దేశంలో ఎన్నో ప్రజా పోరాటాలు ద్వారా చట్టాలు తీసుకురావడంలోనూ మీడియా ప్రముఖమైన పాత్ర పోషించిందని, అయితే అదే మీడియా కరోనా కష్టకాలంలో మీడియా సంస్థలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. సమాజం కోసం పత్రికలు, టెలివిజన్లు పనిచేస్తున్న క్రమంలో ఈ సంస్థలకు ప్రభుత్వపరంగా ప్రకటనలు ఇచ్చి నిలబెట్టుకోవడం సంస్థలో పనిచేసే జర్నలిస్టులకు రాయితీలు కల్పించడం అవసరమన్నారు. కార్మిక, కర్షక వర్గాలకు సహాయ సహకారాలు అందించి నిలబెట్టే పాలకులు నిత్యం వారితో పాటు కలిసి పనిచేసే పాత్రికేయుల జీవన గమనాన్ని గుర్తించాలన్నారు. పాత్రికేయుల సమస్యలపై ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ డిప్యూటీ చీఫ్ విప్ మహేంద్రచౌదరి, ఐఐఎంసి డీజీ ప్రొఫెసర్ సంజీవ్ ద్వివేది, రాయపూర్ కెటి యూనివర్శిటీ మాజీ వీసీ మాన్ సింగ్ పరమార్, బ్రహ్మకుమారీస్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
-----------------------
Admin