తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : పట్టాభి వ్యవహారంపై పచ్చ పత్రికలో వస్తున్న తప్పుడు కథనాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈనాడు డౌన్ డౌన్ అంటు పత్రిక ప్రతులను దహనం చేస్తూ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈనాడు దిన పత్రికలో వస్తున్న తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా ఆ పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాగైనా సరే తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని పచ్చపత్రిక దిగజారి వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిజం ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన పత్రిక ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తుండడం తగదన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతూ ప్రభుత్వ ప్రతిక్షణం దెబ్బతీయాలని తప్పుడు కథనాలు రాస్తున్నారని అయన విమర్శించారు. పట్టాభిరాం అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై నిత్యం అసత్యాలు ప్రసారం చేస్తూ పిచ్చిపిచ్చి శ్రేష్టలతో మీడియా అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి యత్నిస్తున్నాడన్నారు.
-----------------------
Admin