Tuesday, 14 May 2024 02:08:03 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

విషపు రాతలపై నిరసనాగ్రహం:లుకలాపు

Date : 25 February 2023 02:36 PM Views : 340

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : పట్టాభి వ్యవహారంపై పచ్చ పత్రికలో వస్తున్న తప్పుడు కథనాలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈనాడు డౌన్ డౌన్ అంటు పత్రిక ప్రతులను దహనం చేస్తూ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈనాడు దిన పత్రికలో వస్తున్న తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా ఆ పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాగైనా సరే తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని పచ్చపత్రిక దిగజారి వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిజం ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన పత్రిక ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తుండడం తగదన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతూ ప్రభుత్వ ప్రతిక్షణం దెబ్బతీయాలని తప్పుడు కథనాలు రాస్తున్నారని అయన విమర్శించారు. పట్టాభిరాం అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై నిత్యం అసత్యాలు ప్రసారం చేస్తూ పిచ్చిపిచ్చి శ్రేష్టలతో మీడియా అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి యత్నిస్తున్నాడన్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :