Tuesday, 14 May 2024 11:12:25 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు – సంక్షేమ ప‌థ‌కాల‌కు కేబినెట్‌ ఆమోదం..

Date : 08 February 2023 07:25 PM Views : 222

తాజా వార్తాలు / అమరావతి : ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగాదికి అందించే సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. భారీ పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అలాగే, కర్నూలులో రెండో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా తాడేపల్లి గూడెంలో రెవెన్యూ డివిజన్, పోలీస్ డివిజన్‌కు ‎గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 500 మెగావాట్ల ఆదాని హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. చిత్తూరు డైరీ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 106 కోట్ల మాఫీకి ఏపీ కెబినెట్ ఆమోదం తెలిపింది.ఏపీ కేబినెట్‌లో మరో కీలక నిర్ణయం ఏంటంటే.. కల్యాణమస్తుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కల్యాణమస్తు, షాదీ తోఫాను ఈనెల 10నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌. . వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కల్యాణ మస్తులను మంత్రి వర్గం ఆమోదించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై క్యాబినెట్‌ చర్చించింది. కర్నూలు జిల్లా డోన్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బంది నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సీడీ చెల్లింపునకు కూడా ఆమోదం లభించింది. ఈ నెల 28న జగనన్న విద్యాదీవెన చెల్లింపునకు కేబినెట్‌ ఆమోదం. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు, విశాఖలో టెక్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. అటు, నెల్లూరు బ్యారేజ్‌ను నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్యారేజ్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్‌. రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటివ్‌ బెర్త్‌ల నిర్మాణానికి ఆమోదం. లీగల్‌ సెల్‌ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం లభించింది. పంప్‌ స్టోరేజ్‌ హైడ్రో ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులకు ఆమోదం లభించినట్టుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్‌ భేటీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీని మెచ్చుకున్నారు సీఎం జగన్‌. విద్యాశాఖ, వైద్యారోగ్యశాఖ పనితీరు బాగుందన్నారు. దాంతో, సివిల్ సప్లై కూడా బాగానే పనిచేస్తోంది సార్‌ అంటూ మంత్రి కారుమూరి అనడంతో… అయితే, మిమ్మల్ని కూడా అభినందించాలా అంటూ చమత్కరించారు సీఎం జగన్‌.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :