తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఈ నెల 27న సామాజిక సాధికర బస్సు యాత్ర ఎచ్చెర్ల నియోజకవర్గం చిలకపాలేంలో జరుగుతుందని వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మంగళవారం రణస్థలం మండలం ఆ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27న జరగబోయే బస్సుయాత్రను విజయవంతం చేయవలసిందిగా పార్టీ శ్రేణులు అందరినీ సమాయత్తు పర్చాలని దిశానిర్ధేశం తెలియజేశారు. బస్సు యాత్రకు సంబంధించిన కొన్ని వివరాలను నాయకులకు, కార్యకర్తలకు వివరించారు. అనంతరం పోస్టర్లును అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.
-----------------------
Admin