Wednesday, 15 May 2024 04:25:55 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

యువగళానికి 14 షరతులతో కూడిన అనుమతి

Date : 24 January 2023 03:29 PM Views : 212

తాజా వార్తాలు / అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. లోకేష్ యువగళం పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు పోలీసులు. బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. రోడ్లపై ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలను పాటించాలని.. భద్రతల నిర్వహణలో, ట్రాఫిక్ నియంత్రణలో సహకరించాలన్నారు. ఇదిలా ఉంటే పోలీసుల అనుమతిపై తెలుగు దేశం నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.పోలీసులు విధించిన ఆంక్షలు పాదయాత్రలో పాటించలేమని ఇలాంటి షరతులతో కూడిన అనుమతి తమకు వద్దని కొందరు టీడీపీ నేతలు అన్నట్లుగా తెలుస్తోంది. పాదయాత్రకు టీడీపీ దరఖాస్తు చేసుకున్న విషయం, నిబంధనలకు లోబడి ఎలాంటి షరతులతో అనుమతి ఇచ్చామనే దానిపై పోలీస్ అధికారులు ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేశారు.పాదయాత్ర షెడ్యూల్ ఇలా.. ఈ నెల 27న కుప్పం నుంచి నడక ప్రారంభించనున్నారు నారా లోకేష్. ఈ పాదయాత్ర కార్యక్రమం షెడ్యూల్ ఇలా సాగబోతోంది. ఈ నెల 25న లోకేష్ హైదరాబాద్‌‌లో తన నివాసం నుంచి బయలుదేరి ఎన్టీఆర్‌ ఘాట్‌ చేరుకుంటారు. అక్కడే దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి కడపకు వెళతారు.. అక్కడ పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం మరియాపురంలోని కేథలిక్‌ చర్చిని సందర్శించి ప్రార్థనల్లో పాల్గొంటారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :