Tuesday, 14 May 2024 09:04:41 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

వైసీపీ వర్సెస్‌ జనసేన.. విశాఖ తీరంలో పొలిటికల్‌ సునామీ.. పేలుతున్న మాటల తూటాలు.

Date : 12 August 2023 07:11 PM Views : 152

తాజా వార్తాలు / అమరావతి : వారాహి విజయయాత్రపేరుతో విశాఖలో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ అధికారపార్టీని టార్గెట్‌ చేశారు. విశాఖపట్నం నుంచి వైసీపీని తన్నితరిమేస్తామంటున్న పవన్‌.. భూ కబ్జాలపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. రుషికొండపై జనసేన, వైసీపీకి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. అటు వాలంటీర్లపై విమర్శలకు కట్టుబడి ఉన్నామంటున్న జనసేన అధ్యక్షుడు... ఎంపీ కుటుంబానికే రక్షణ లేని నగరంగా విశాఖను మార్చారంటూ ఆరోపించారు.వారాహి విజయయాత్రపేరుతో విశాఖలో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ అధికారపార్టీని టార్గెట్‌ చేశారు. విశాఖపట్నం నుంచి వైసీపీని తన్నితరిమేస్తామంటున్న పవన్‌.. భూ కబ్జాలపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. రుషికొండపై జనసేన, వైసీపీకి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. అటు వాలంటీర్లపై విమర్శలకు కట్టుబడి ఉన్నామంటున్న జనసేన అధ్యక్షుడు… ఎంపీ కుటుంబానికే రక్షణ లేని నగరంగా విశాఖను మార్చారంటూ ఆరోపించారు.పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు టూరిజం మంత్రి ఆర్కే రోజా. అనుమతి ఇచ్చిన విస్తీర్ణం కంటే తక్కువ ఏరియాలోనే నిర్మాణాలు జరుగుతున్నాయని.. రుషికొండపై రాద్దాంతం తగదన్నారు. తీసుకున్న ప్యాకేజ్‌ కోసం జనసేన అధ్యక్షుడు పవన్‌ పనిచేస్తున్నారని మండిపడ్డారు. గతంలో విశాఖలో టీడీపీ నేతలు భూములు దోచుకుంటే.. ఇప్పుడు ఇన్‌ఫోసిస్‌, అదానీ డేటా సెంటర్‌, రహేజా వంటి కంపెనీలను సీఎం జగన్‌ తీసుకొచ్చారన్నారు మంత్రి.విశాఖను రాజధాని పేరుతో దోచుకుంటున్నారని జనసేన అంటే.. పాలనా రాజధానినగరంగా ప్రకటిస్తే జనసేన, టీడీపీ విషం కక్కుతున్నాయంటోంది వైసీపీ. సాగర తీరంలో రేగిన విమర్శల తుఫాను ఏ తీరం దాటుతుందో చూడాలి.విశాఖపట్నంలో కొనసాగుతున్న పవన్‌ కల్యాణ్‌ టూరు ప్రకంపనలు.. రుషికొండపై కొనసాగుతున్న మాటలయుద్ధం.. టూరిజం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను నిన్న పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌ అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో దోచుకున్నట్టే ఇప్పుడు విశాఖపట్నంలోనూ రాజధాని పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు పవన్‌. ఎంపీ కుటుంబసభ్యులను కిడ్నాప్‌ చేస్తే కూడా ఈ ఎంపీ సమర్ధించుకోవడం సిగ్గుచేటన్నారు పవన్‌ కల్యాణ్‌.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :