తాజా వార్తాలు / హైదరబాద్ : దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ (Independence Day) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తికావొస్తున్న సందర్భంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని.. దేశంలో ఆజాదీ కా అమృత మహోత్సవ్ పేరుతో అంగరంగా వైభవంగా స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించాలని ప్రధాని మోదీ కోరారు. ఈక్రమంలో ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఎంతోమంది సమరయోధులను గుర్తు చేసుకుంటూ సినీ తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులకు 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. నా ఇంటి ముందు రెప రెపలాడుతున్నమన త్రివర్ణ పతాకం అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి ధరమ్ తేజ్, రియల్ హీరో సోనూ సూద్, షారుఖ్ ఖాన్ వంటి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
-----------------------
Admin