తాజా వార్తాలు / ఏలూరు : మంచి అవకాశం మించిన దొరకదు త్వరపడండి.. అంటూ వ్యాపార సముదాయాలు పండుగలకు తెగ ఆఫర్లు ప్రకటించేస్తుంటారు. అయితే ఇక్కడ పబ్లిక్ గా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ మాత్రం లేదు కానీ.. మీకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఆక్కడ దొరుకుతుంది. మార్కెట్లో పల్లీలు అమ్మినంత ఈజీగా ఫేక్ సర్టిఫికెట్లు అమ్మేస్తున్నారు ఓ ముఠా. ఏదో సినిమాలో అన్నట్టుగా జీఎం కావాలా.. ఏజీఎం కావాలా.. టోపీ పెట్టుకునే ఉద్యోగం కావాలా.. అంటూ నిరుద్యోగులను బురిడీ కొట్టించిన సన్నివేశం మీకు గుర్తు ఉండే ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలానే పరిస్థితి ఉంది. కేజీ నుంచి పీజీ వరకు మీకు నచ్చిన కాలేజీలో మీరు చదివినట్లుగా మీకు సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరు ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్లు చలామణిలో ఉన్నాయి. అయితే అలాంటి ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా ఆట కట్టించారు ఏలూరు పోలీసులు.. చింతలపూడి కేంద్రంగా జరుగుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఏలూరు కు చెందిన దినేష్ కంప్యూటర్ పరిజ్ఞానంలో ఎంతో అనుభవం ఉంది. చింతలపూడి కి చెందిన సోంబాబు తన పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులను ఏలూరులోనీ కొన్ని కాలేజీలకు క్యాంపెయిన్లో బాగంగా కొత్తగా కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులను జాయిన్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే దినేష్ కు సోంబాబుకు పరిచయం ఏర్పడింది. అయితే ఈ విద్యార్హత లేకుండా నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందాలనే వారి వీక్నెస్ను వీరు క్యాష్ చేసుకున్నారు.
-----------------------
Admin