తాజా వార్తాలు / అమరావతి : భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కష్టం.. ఇది ఎవరో అన్న మాట కాదు.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించిన మాటలివి.. 2021 రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ప్రధాని మోడీ.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని.. అదే ఫైనల్ అంటూ పేర్కొనడం.. భారత రాజ్యాంగం పట్ల ఆయనకున్న మేథో శక్తి, విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పలు కీలక అంశాల గురించి (Modi Archive) ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రధాని మోడీ.. గుజరాత్ సీఎంగా ఉన్న నాటినుంచి.. ప్రధానమంత్రి అయ్యే వరకు తాను భారత రాజ్యాంగ స్ఫూర్తితో అనుసరించిన పలు కీలక అంశాల గురించి ప్రస్తావించారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించిన జ్ఞాపకార్థంగా.. 2015 నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవంగా కేంద్రం నిర్వహిస్తోంది. బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని 2015లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం.. ఈ రోజును రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఈ రోజును లా డేగా పాటించేవారు. అయితే, ప్రధాని మోడీ తాజాగా.. మోడీ ఆర్కైవ్ లో షేర్ చేసిన అంశాలు.. ఆయనకు భారత రాజ్యాంగంపై ఉన్న మక్కువ.. దార్శనికతకు ఈ కార్యక్రమాలు అద్దంపడుతున్నాయి.
-----------------------
Admin