తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుమాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా రానున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్, ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కలి శెట్టి అప్పలనాయుడు గారుజోష్యం చెప్పారు . మంగళవారం రణస్థలం హెడ్ క్వార్టర్ లో ' మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలి.. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి' అనే ర్యాలీ కార్యక్రమాన్ని శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు సారాధ్యంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాదిమంది జనం పాల్గొనడం విశేషం.ఈ సందర్భంగా అప్పలనాయుడు గారుమాట్లాడుతూ రానున్న 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలుపు ఒక చారిత్రక నిర్ణయం కాబోతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా తెలుగు వారందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు ఆమోదిస్తున్నారని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థులను ఎన్నికల్లో నిలిపేందుకు ముమ్మర ప్రయత్నాలను సాగిస్తున్నారని తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడులకు గిఫ్ట్ గా ఇవ్వనున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారురాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబునాయుడు గారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సక్రమార్గంలో ఉండాలంటే చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్లీ రావాల్సిందేనని స్పష్టం చేశారు.
-----------------------
Admin