Tuesday, 14 May 2024 04:12:07 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

చంద్రబాబు ముఖ్యమంత్రిగా మళ్లీ రాబోతున్నారు...కలిశెట్టి

Date : 07 November 2023 06:48 PM Views : 215

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుమాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా రానున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్, ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కలి శెట్టి అప్పలనాయుడు గారుజోష్యం చెప్పారు . మంగళవారం రణస్థలం హెడ్ క్వార్టర్ లో ' మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలి.. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి' అనే ర్యాలీ కార్యక్రమాన్ని శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు సారాధ్యంలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ ర్యాలీలో వేలాదిమంది జనం పాల్గొనడం విశేషం.ఈ సందర్భంగా అప్పలనాయుడు గారుమాట్లాడుతూ రానున్న 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలుపు ఒక చారిత్రక నిర్ణయం కాబోతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా తెలుగు వారందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు ఆమోదిస్తున్నారని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థులను ఎన్నికల్లో నిలిపేందుకు ముమ్మర ప్రయత్నాలను సాగిస్తున్నారని తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడులకు గిఫ్ట్ గా ఇవ్వనున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారురాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబునాయుడు గారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారేనని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సక్రమార్గంలో ఉండాలంటే చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్లీ రావాల్సిందేనని స్పష్టం చేశారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :