Tuesday, 14 May 2024 12:49:08 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఏపీ విద్యార్ధులకు అలెర్ట్.. ఏప్రిల్‌లో ఎన్ని రోజులు స్కూళ్లకు సెలవులంటే?

Date : 31 March 2023 12:43 PM Views : 234

తాజా వార్తాలు / అమరావతి : ఒకవైపు ఎండలు ముదురుతున్నాయి. మరోవైపు పరీక్షల తేదీలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్ధులు పాస్ అయ్యేందుకు కష్టపడి రాత్రింబవళ్ళు చదువుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఏపీలో ఒంటిపూట బడులు ఏప్రిల్ 4వ తేదీ నుంచి మొదలు కానున్నాయని విద్యాశాఖ అనధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఒంటిపూట బడులను ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు పదో తరగతి పరీక్షలు నిర్వహించే ఎగ్జామ్ సెంటర్ల(స్కూల్స్)లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారని సమాచారం.అటు టెన్త్ క్లాస్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్నాయి. పదో తరగతి విద్యార్ధులకు పరీక్షలు పూర్తయిన వెంటనే వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అలాగే 1 నుంచి 9 తరగతులకు ఏప్రిల్ 27 వరకు పరీక్షలను నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఫలితాల ప్రకటన, పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. ఇక వారికి ఏప్రిల్ 30 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు సెలవులు ప్రకటించే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏప్రిల్ 5(బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి), ఏప్రిల్ 7(గుడ్ ఫ్రైడే), ఏప్రిల్ 14(డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి), ఏప్రిల్ 22(బక్రీద్) ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌కు సెలవులు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :