Tuesday, 14 May 2024 08:13:42 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

ఇండియా ఎప్పుడు వాడుకలోకి వచ్చింది.. అంతకుముందు ఏ పేరుతో పిలిచేవారో మీకు తెలుసా.. .

Date : 06 September 2023 11:50 AM Views : 128

తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : భారత్, ఇండియా అనే పేరుపై దేశంలో రాజకీయ దుమారం మొదలైంది. G-20కి సంబంధించి, సెప్టెంబర్ 9న విందుకు ఆహ్వాన పత్రికలో భారత రాష్ట్రపతి అని రాసి ఉందని, అంతకుముందు ఇండియా ప్రెసిడెంట్ అని రాసి ఉందని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. దేశ గౌరవానికి సంబంధించిన అంశంపై కాంగ్రెస్‌కు ఎందుకు అంత అభ్యంతరమని అన్నారు. అమృతోత్సవ వేళ దేశం పేరు ఇండియా మారి భారత్‌గా పిలవబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో ఈ పేర్ల వెనకున్న చరిత్ర ఏంటో తెలుసా! ఇండియా పేరు ఎలా వచ్చింది? అంతకుముందు ఏం పేర్లున్నాయనేది ఆసక్తికరంగా మారింది. భరత వర్ష, భారత అనేది పురాణాల కాలం నుంచి వినిపిస్తున్న పేర్లు. ఆర్యావర్త, జంబూద్వీపం, నభివర్ష అనే పేర్లు కూడా వైదిక సంస్కృతిలో కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం మూడువేల సంవత్సరాలనాటి మెసపటోమియా నాగరికత కాలంలో లభించిన ఆధారాల ప్రకారం సింధు నాగరికత విలసిల్లిన ప్రస్తుత భారత ఉపఖండాన్ని మెలూహా పేరుతో పిలిచే వారని చరిత్రకారులు చెబుతున్నారు. రాజకీయ చరిత్రలో మెలూహాకు పెద్ద ప్రాధాన్యం లభించలేదు. భరతవర్ష, భారత్‌ మాత్రం తరతరాలుగా కొనసాగుతూ వచ్చాయి. పర్షియన్ల రాకతో హిందూ పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్దిలో సింధు లోయను స్వాధీనం చేసుకున్న పర్షియన్లు – సంస్కృతంలోని సింధును హిందుగా పలికారు. క్రీస్తుశకం ఆరంభంలో దీనికి పర్షియన్‌ పదం ‘స్థాన్‌’ జోడించి హిందుస్థాన్‌గా మార్చేశారు. పర్షియన్ల హింద్‌ కాస్తా గ్రీకుల నోళ్లలో ఇండస్‌గా మారింది. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దిలో అలెగ్జాండర్‌ భారత్‌పై దండెత్తి ఇండస్‌ తర్వాతి ప్రాంతాన్ని ఇండియాగా పలికాడు. అనంతరం భారత దేశంలో అడుగు పెట్టిన మొఘల్‌ చక్రవర్తులు మన దేశాన్ని హిందూస్తాన్ గా పిలిచేవారు. అంతేకాదు మన దేశాన్ని ఆసియాలోని అనేక దేశాల్లో ‘హిందుస్థాన్‌’గానే పిలిచేవారు.. ఇదే పేరు 18వ శతాబ్దం చివరి వరకూ ప్రాచుర్యంలో ఉంది. ప్రాచీన గ్రీకులు భారతదేశానికి సింధు అనే పదాన్ని ఉపయోగించారు. తరువాత ఈ పదం రోమన్ల ద్వారా లాటిన్ భాషలోకి వెళ్ళింది. లాటిన్ నుండి ఈ పదం ఆంగ్ల భాషలో వచ్చి ఇండియాగా మారింది. 16వ శతాబ్దంలో బ్రిటీష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు.. వారికి భారతదేశం అనే పేరు కూడా తెలుసు. భారతదేశానికి “హిందుస్తాన్”, “జంబూద్వీప్పం”, “ఆర్యవర్త”, “హిందూదేశం”, సింధు దేశం, హిందూస్తాన్ , భరత వర్షం వంటి అనే ఇతర పేర్లు కూడా ప్రసిద్ధి చెందాయి. అఖండ భారత దేశం బ్రిటిష్‌ వారి పాలనలోకి వెళ్లిన తర్వాత అప్పటి వరకూ ఉన్న హిందూస్తాన్ ప్లేస్ లో ఇండియా చేరింది. మనదేశంలో తమ ప్రభావాన్ని నెలకొల్పడానికి బ్రిటిష్ వారు మన పేర్లు, చదువు, సంప్రదాయాలను మరుగుపరిచేలా చేస్తూ.. ఇండియా పేరుని చేర్చారు. సర్వే ఆఫ్‌ ఇండియా వంటి వాటితో అధికారికంగా వాడడం మొదలు పెట్టారు. బ్రిటిష్‌ పాలకుల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం మళ్ళీ దేశం పేరుపై చర్చ జరిగింది. ఇండియా పేరునే కొనసాగించాలని కొంతమని కోరితే.. లేదు భారత్ అనే కొనసాగించాలని మరికొందరు డిమాండ్ చేశారు. అయితే చివరకు రాజ్యాంగంలో ఇండియా, భారత్ అనే రెండు పేర్లు వాడకంలో ఉంచేశారు. అయితే అప్పుడప్పుడు ఇండియా పేరుని భారత్ గా మార్చాలని డిమాండ్ తెరపైకి వస్తూనే ఉన్నాయి. 2012లో కాంగ్రెస్‌ సభ్యుడు శాంతారాం నాయక్‌ .. భారత్‌ మాతాకీ జై అంటాము కానీ.. ఇండియాకీ జై అనం సో మన దేశం పేరుని భారత్ గా మార్చమంటూ పార్లమెంటులో దేశం పేరును భారత్‌ గా మార్చాలని బిల్లుని ప్రవేశ పెట్టారు. తర్వాత యోగి ఆదిత్యనాథ్ ఎంపీగా ఉన్న సమయంలో 2014లో భారత్ గా పేరు మార్చాలనే డిమాండ్ తో బిల్లుని ప్రవేశ పెట్టారు. అంతేకాదు చాలామంది సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఇది తమ చేతుల్లో లేదని.. కేంద్రం చేతుల్లో ఉందని పేర్కొంది. అయితే ఇప్పుడు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగత్ ఇక నుంచి అయినా ఇండియా ప్లేస్ లో భారత్ గా పిలమంటూ ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో మనదేశంపై పేరు మళ్ళీ చర్చల్లో నిలిచింది. జీ20 శిఖరాగ్ర సమావేశాల ఆహ్వాన పత్రికలో భారత్ ప్రస్తావన తీసుకువచ్చింది కేంద్రం. దీంతో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకుతెరలేపినట్లు అయింది.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :