తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : ఉత్తరాంద్ర ఇలావేల్పు కమ్మ సిగడాం శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు మూడురోజులు జరగనుందని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని కమ్మసిగడాంలోని శ్రీ మహాలక్ష్మి తల్లి కమ్మవారి కళ్యాణ మండపం లో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జాతర సక్రమంగా జరిపించేందుకు జాతర మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి ఎవరు ఏ పనులు చెయ్యాలి, కల్చరల్ ప్రోగ్రాం, జాతర అభివృద్ధి తదితర పలు అంశాలు చర్చించుకున్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు వెలిచేటి రామకృష్ణ, వి.తేజ, వి. రాజశేఖర్, మన్నె లక్ష్మిప్రసాద్, వెలిచేటి పాల్గుణరవు, సురేష్ కుమార్, మురళిధర్, రాయుడు, వి.జె.ఎస్.ఎల్.పి. మౌళి, గురాల జగన్నాధరవు, మన్నె కృష్ణానందం తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin