తాజా వార్తాలు / అమరావతి : ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. విద్యుత్ వినియోగదారులపై 2023-24 వ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఛార్జీల భారం పడలేదు.ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్. విద్యుత్ వినియోగదారులపై 2023-24 వ ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఛార్జీల భారం పడలేదు.సాధారణ, పారిశ్రామిక వినియోగదారుల కేటగిరిలో ఎవరిపై అదనపు ఛార్జ్లు ఉండబోవన్నారు రిటైర్డ్ జస్టిస్ నాగార్జునరెడ్డి. ఈ ఏడాది విద్యుత్ వినియోగదారులు ఎటువంటి భారం మోపడంలేదన్నారు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కంపెనీలకు ఇచ్చే హెచ్టీ వినియోగదారులకు మాత్రం కిలోవాట్కు 475 రూపాయల అదనపు డిమాండ్ ఛార్జ్ల ప్రతిపాదనను అంగీకరించామన్నారు. వీటి టారిఫ్ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువేనన్నారు. మిగతా పెంపు ప్రతిపాదనలు తిరస్కరించామన్నారు.
-----------------------
Admin