Wednesday, 15 May 2024 01:38:19 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై వాట్సాప్‌లో ఫుడ్‌ ఆర్డర్ చేసుకోవచ్చు.

Date : 06 February 2023 07:56 PM Views : 187

తాజా వార్తాలు / అమరావతి : భారతీయ రైల్వే ముఖ చిత్రం మారుతోంది. రైల్వేల ఆధునీకరణతో పాటు వందే భారత్‌ రైళ్లతో రైల్వేకు కొత్త హంగులు దిద్దుతోన్న భారత రైల్వే ఇటీవల మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు ప్రయాణం చేసే సమయంలో..భారతీయ రైల్వే ముఖ చిత్రం మారుతోంది. రైల్వేల ఆధునీకరణతో పాటు వందే భారత్‌ రైళ్లతో రైల్వేకు కొత్త హంగులు దిద్దుతోన్న భారత రైల్వే ఇటీవల మరో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు ప్రయాణం చేసే సమయంలో ఫుడ్‌ ఆర్డర్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫుడ్ ఆన్ ట్రాక్ కోసం ఈ -కేటరింగ్ యాప్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ -కేటరింగ్ సేవలను అందించడమే లక్ష్యంగా ఇండియన్‌ రైల్వేస్‌ మరో అడుగు ముందుకేసింది.రైల్వే ప్రయాణికులకు ఈ -కేటరింగ్ విధానం ద్వారా ఇకపై వాట్సాప్‌ను ఉపయోగించి ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఇందుకోసం వాట్సాప్ నంబర్ +91-8750001323ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఐఆర్‌సీటీసీ రెండు విధానాలను తీసుకొచ్చింది. మొదటి విధానంలో రైలులో ప్రయాణం చేస్తున్న వారికి వాట్సాప్‌ బిజినెస్‌ నెంబర్ ద్వారా ఈ-క్యాటరింగ్ సేవలను పొందేందుకు మెసేజ్‌ రూపంలో ఈ-టికెట్ పంపిస్తారు. దీని ద్వారా ప్రయాణికులు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే అవసరం లేకుండా నేరుగా వెబ్‌సైట్‌ ద్వారా ఫుడ్‌ను బుక్‌ చేసుకోవచ్చు.ఇక మరో విధానంలో వాట్సాప్‌ నెంబర్‌ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన చాట్‌ బాక్స్‌తో సంభాషించి ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఈ క్యాటరింగ్ విధానాన్ని మొదట ఎంపిక చేసిన కొన్ని రైళ్లలో అమలు చేయనున్నారు. అనంతరం కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మిగతా రైళ్లలోనూ అమలు చేయనున్నారు. ఈ సేవలను ప్రారంభించిన తొలి రోజే ఐఆర్‌సీటీసీకి చెందిన ఈ-క్యాటరింగ్‌, యాప్‌ ద్వారా సుమారు 50000 ఫుడ్‌ ఆర్డర్స్‌ జరిగాయి.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :