తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం డాక్టర్ రెడ్డీస్ పరిశ్రమ సిటిఓ-6లో యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యు.ఎస్.ఎఫ్.డి.ఎ.) వారు తొమ్మిది రోజులు పాటు పరీక్షలు నిర్వహించారు. జూలై 10న ప్రారంభమైన తనిఖీలు జూలై 19 నాటికి ముగించారు. ఈ సందర్భంగా యు.ఎస్.ఎఫ్.డి.ఎ వారు మాట్లాడుతూ డాక్టర్ రెడ్డీస్ వారు నాణ్యమైన ప్రొడక్షన్స్తో పనిచేస్తున్నారని అలాగే జీరో అబ్జర్వేషన్స్ మరియు నో యాక్షన్ ఇండెక్స్ (NAI) అనే వర్గీకరణతో తనిఖీ ముగించామని వారు తెలిపారు. దీంతో సిటిఓ6 మేనెజిమెంట్ ఒక్కసారిగి ఊపిరిపీల్చుకుంది. అనంతరం సిటిఓ6లో పనిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపింది.
-----------------------
Admin