Tuesday, 14 May 2024 03:32:33 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

దేశ చరిత్రలో మరో మైలురాయి.. తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్..

Date : 18 November 2022 12:15 PM Views : 331

తాజా వార్తాలు / హైదరబాద్ : భారత్ అంతరిక్ష రంగంలో మరో మైలురాయి నమోదైంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేట రాకెట్‌ను ఇస్రో శాస్త్తవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పటి వరకూ భారత్ కి సంబంధించిన ప్రయోగాలనే చేపట్టిన ఇస్రో.. పలు ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపించినా రాకెట్ మాత్రం ఇస్రోనే తయారు చేసేది. కానీ ఈసారి రాకెట్ కూడా ప్రైవేటుదే కావడం విశేషం. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ ప్రయోగం చేపట్టినట్లు అధికారులు, సైంటిస్టులు చెప్పారు. తద్వారా ఈ రంగంలో స్టార్టప్‌లు పెరిగే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌ ‘స్కైరూట్‌ ఏరోస్పేస్‌’ ఈ రాకెట్‌ను తయారు చేసింది. దీనికి విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. విక్రమ్-ఎస్1 అనే పేరుతో ఈ ప్రయోగం జరిగింది. తొలిసారిగా పంపిన ఈ రాకెట్ పేరు ప్రారంభ్. ఈ రోజు ఉదయం 11. 30 గంటలకు నింగిలోకి వెళ్లిన విక్రమ్‌- ఎస్‌ రాకెట్‌ 6 మీటర్ల పొడవు, 545 కిలోల బరువు ఉంటుంది. భూమికి 103 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. శ్రీహరికోటకు 115. 8 కిలోమీటర్ల దూరాన సముద్రంలో రాకెట్ పడిపోనుంది. కేవలం 4. 50 నిమిషాల్లోనే ఈ ప్రయోగం పూర్తి కానుంది. పెద్ద మొత్తంలో నిధుల సమీకరించిన స్కైరూట్ లక్ష్యాలు భారీగానే ఉన్నాయి. ట్రిలియన్ డాలర్ స్పేస్ మార్కెట్ లో విపరీతమైన అవకాశాలున్నాయని, వీటిని అందిపుచ్చుకునేందుకు ఈ రంగంలో స్టార్టప్ ను స్థాపించామని ఆ కంపెనీ సీఈఓ పవన్ కుమార్ అన్నారు. అంతర్జాతీయంగా చిన్న శాటిలైట్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే తాము ఈ సంస్థను నెలకొల్పామన్నారు. అంతరిక్ష వ్యాపారంలో మరింత ఎదగడం కోసం స్కైరూట్- ఇస్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దిశగా అడుగులు వేసిన తొలి స్టార్టప్ స్కైరూట్. స్కైరూట్ నినాదమేంటంటే.. అందరికీ ఓపెన్ స్పేస్. ఈ పేరు మీద వీరు మొదలు పెట్టిన మిసన్ లో దీర్ఘకాలిక భాగస్వాములను ఆహ్వానిస్తున్నారు. స్పేస్ లో ఇకపై భారీ లాభాలుండబోతున్నాయని.. చెబుతూ.. ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :