తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : అరబిందో ఫార్మా ఫౌండేషన్ వారు సామజిక బాధ్యత లో భాగంగా శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, నారువా పంచాయితీలో గ్రామీణ అభివృద్ధి కోసం రూ. 25 లక్షల రూపాయలతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న సీసీ డ్రైనేజీస్ లు కట్టడం ఎంతో ఆనంధాయకంగా ఉందని అరబిందో ఫార్మా ఫౌండేషన్ యాజమాన్యం నిత్యానంద రెడ్డి, శరత్ చంద్రరెడ్డి యూనిట్ ప్రతినిధులు తెలిపారు. ఎన్నో రోజులుగా నారువ పంచాయితీ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని గ్రామ పెద్దలు అరబిందోఫార్మా యాజమాన్యాన్నికి తెలపడంతో యుద్ధ ప్రాతిపదికంగా పనులు చేపట్టడం అలాగే కొన్ని రోజుల వ్యవదిలో గ్రామ పంచాయితీ పెద్దలు మరియు ప్రతినిధుల సమక్షంలో ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషకంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అరబిందోఫార్మా యాజమాన్యాన్నికి ప్రత్యేకంగా కృతజ్ఙతలు తెలియజేస్తున్నారు.
-----------------------
Admin