తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : జనసేన పార్టీ ఆధినేత పవన్కళ్యాణ్ ఆదేశాలు మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తగా డాక్టర్ సయ్యద్ విశ్వక్షేన్ను నియమించినట్లుగా ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయ కర్తగా భాద్యతలు అప్పగించినందుకు నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, సేహ్నితులు లావేరు మండలం, సుభద్రాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తులతో నియోజకవర్గంలో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామంటూ వచ్చే ఎన్నికలలో ఎవరికి అవకాశం ఇచ్చిన ఇరు పార్టీలతో సమన్వయంతో కలిసి పనిచేయడానికి నేను సిద్దంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
-----------------------
Admin