Tuesday, 14 May 2024 11:44:58 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. ఐదు రోజులపాటు భారీ వర్షాలు..

Date : 24 August 2023 02:23 PM Views : 275

తాజా వార్తాలు / అమరావతి : వాతావరణ శాఖ మళ్లీ తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల పాటు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ మేరు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఎల్లో, గ్రీన్ అలర్ట్ జారీ చేసింది.ఉత్తర-దక్షిణ ద్రోణి, దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి అంతర్గత తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో వ్యాపించి ఉన్నది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ గాలులు వీస్తున్నాయని.. దీంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌ సహా.. మేడ్చల్‌, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో, గ్రీన్‌ అలర్ట్‌ను జారీ చేశారు. వీటితోపాటు.. అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది.కాగా.. ఇటీవల కురిసిన వర్షాలు మళ్లీ ముఖం చాటేయడంతో అన్నదాతలు.. వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఖరిఫ్ సీజన్ ప్రారంభమయినప్పటికీ.. చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు వేయలేదు..

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :