తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయం. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించిన ఎస్పీ శ్రీమతి జి.ఆర్. రాధిక, ఏ.ఎస్పీ నాగమణికంఠ, అదనపు ఎస్పీ విఠలేశ్వర్. ఈ సందర్భంగా ఆ మహనీయుని త్యాగాన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ఎం. మహేంద్ర, ఎస్. బాలరాజు, ఏస్. వాసుదేవ్, ఏ.ఓ ఎం. శివ రామ రాజు, కార్యాలయ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin