Tuesday, 14 May 2024 03:12:39 PM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

తమిళనాడులో దడపుట్టిస్తోన్న కరోనా.. ఎయిర్‌పోర్టులో నలుగురికి పాజిటివ్‌..

Date : 28 December 2022 04:17 PM Views : 232

తాజా వార్తాలు / అమరావతి : చైనాలో కరోనా నానాటికి భీభత్సం సృష్టిస్తోంది. రోజూ లక్షల మంది ప్రజలు మృతి చెందుతున్నారు. మార్చురీలు, స్మశానల్లో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇక ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 పాజిటివ్‌ కేసులు కూడా పలు దేశాల్లో భారీగా నమోదవుతున్నాయి. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వారు అధికంగా కరోనా బారీన పడుతున్నారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో మంగళవారం (డిసెంబర్‌ 27) ఉదయం ఇద్దరికి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినట్లు తేలింది. చైనా నుంచి వచ్చిన ఓ మహిళ, ఆమె కుమార్తెకు కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో క్వారంటైన్‌కు తరలించారు. బుధవారం (డిసెంబర్‌ 28)న కూడా దుబాయ్‌ నుంచి చెన్నైకి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. వీరిని కూడా క్వారంటైన్‌కు తరలించారు.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ టెస్టులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మంగళ, బుధ వారాల్లో మదురై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు కరోనా టెస్టులు చేశారు. తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు ఈ నలుగురి శాంపిల్స్‌ను జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్టు తెలిపారు.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :