Tuesday, 14 May 2024 09:22:47 AM
# స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సర్టిఫికేట్స్ అంద‌జేత‌ # అంద‌రికి మెరుగైన వేత‌న ఒప్పందంః ఎపిటోరియా ఫార్మా # మీరు కూచునే విధానం మీరెలాంటి వారో చెప్పేస్తుంది.. తెలుసా? # సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు # గ్రామ స‌చివాల‌యాల వ్య‌వ‌స్థ‌తోనే పార‌ద‌ర్శ‌క పాల‌నః గొర్లె # ర‌క్త‌దానం ఎంతో గొప్ప‌దిఃబొత్స స‌త్య‌నారాయ‌ణ‌ # జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. ! # అజ్ఞాతంలోకి టిడిపి జిల్లా అధ్యక్షుడు? అసలు కారణమేంటి.. # ఏపీ కాంగ్రెస్‎తో కమ్యూనిస్టుల దోస్తీ.. కలయిక వెనుక అసలు కథేంటి.. # ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..!! # విశాఖ.. 4 స్థానాల్లో సమన్వయకర్తలను ప్రకటించిన పవన్ # ఉచిత బస్సు ప్రయాణం, పంట రుణాల మాఫీ? నేడు వైసీపీ మేనిఫెస్టో ప్రకటన? # పవన్ కళ్యాణ్ పర్యటనకు బ్రేక్.. ప్రభుత్వంపై జనసైనికులు ఆగ్రహం # నేను సీఎం కాకుండా చిరంజీవి అడ్డుకున్నాడు.. బొత్స సంచలన వ్యాఖ్యలు # చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం # నీకు దమ్ముందా?… సీఎం జగన్‌కు షర్మిల సవాల్ # వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన విజయనగరం మాజీ ఇంచార్జ్ వర్గం # వైసీపీ రాజ్యసభ కి వైసీపీ అభ్యర్థులు వీళ్లే..! # నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. # పెట్రోల్‌పై రూ. 6, డీజిల్‌పై రూ. 10 తగ్గే ఛాన్స్!

గంటా, కన్నా, బోండా భేటీ.. త్వరలోనే సంచలన ప్రకటన ఉంటుందా..?

Date : 15 December 2022 08:07 PM Views : 203

తాజా వార్తాలు / అమరావతి : గంటా, కన్నా, బోండా. వీరి పార్టీలు వేరు. కానీ వీరిలో కామన్‌ పాయింట్‌ కాపు సామాజికవర్గం. వీరు ముగ్గురు అర్ధరాత్రి వరకు చర్చలు జరపడమే ఇప్పుడు ఏపీలో పొలిటికల్‌ అటెన్షన్‌ను క్రియేట్‌ చేస్తోంది. పైగా వీరి భేటీకి ముందు కన్నా లక్ష్మీనారాయణను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌ కలవడం మరింత ఆసక్తిగా మారింది. బీజేపీ నేత కన్నా, టీడీపీలో ఉన్న గంటా, బోండా ఉమ బుధవారం విజయవాడలో కలిశారు. అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. గతంలో ఎప్పుడూ కలవని వీరు చర్చలు జరపడం ఆసక్తిగా మారింది. ఈ నెల 26న రంగా వర్ధంతి రోజున విశాఖలో కాపు నాడు మహాసభ ఉంది. ఆ రోజు వివిధ పార్టీల్లోని కాపు నేతలంతా కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో కన్నా, గంటా, బోండా భేటీ రాజకీయ ప్రాధాన్యతను పెంచేస్తోంది.వీరంతా కలిసి ఒకే జెండా కప్పుకుంటారా? లేదంటే కొత్త జెండాను ప్రకటిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. అదీ కాక గంటా, కన్నాను కలవడానికి ముందు జనసేన నేత నాదెండ్ల మనోహర్‌… లక్ష్మీనారాయణను కలవడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం ఆసక్తిగా మారింది. ఇటీవల కాపు సీఎం నినాదాన్ని వినిపిస్తున్నారు కొందరు నేతలు. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాలు కీలకంగా మారాయి. కాపు నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించే వారికే తమ మద్దతు ఉంటుందనే ప్రకటన చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు గంటా శ్రీనివాసరావు. తమ భేటీలో రంగా వర్ధంతి కార్యక్రమం చర్చకే రాలేదన్నారు బోండా ఉమ. రాజకీయ చర్చే జరగలేదన్నారు. బుధవారం రాత్రి కన్నా కూడా ఇదే చెప్పారు. కేవలం డిన్నర్‌ కోసమే మీటింగ్‌ అయ్యామని చెప్పుకొచ్చారు. ఏమో లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

-----------------------

YTTV News

Admin

మరిన్ని వార్తలు

Copyright © Yttv News 2024. All right Reserved.

Developed By :