తాజా వార్తాలు / హైదరబాద్ : Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ అగ్నిగుండంలా రగిలిపోతోంది. జూన్లో చెలరేగిన మంటలు మూడ్నెళ్లుగా మండుతూనే ఉన్నాయ్. ఆ విద్యాలయంలో చదువుకోవాలన్నా, కడుపునిండా భోజనం చేయాలన్నా, కంటినిండా నిద్రపోవాలన్నా ఓ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యల సుడిగుండంలో నలిగిపోతున్నారు అక్కడి విద్యార్ధులు. ఒక ఇష్యూ సద్దుమణిగింది అనుకునేలోపే మరో ఇష్యూ తెరపైకి రావడం, బాసర ట్రిబుల్ ఐటీ అగ్నిగుండంగా మార్చేస్తోంది. సమస్యలు పరిష్కారమయ్యాయ్, విద్యాలయం గాడిలో పడుతుందనుకునేలోపు మళ్లీ సమస్య, ఒకటి కాదు వేల సమస్యలు బాసర ట్రిపుల్ ఐటీని చుట్టుముడుతున్నాయ్. కారణాలేవైనా నెలరోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్ధులు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో మరణించడం కలకలం రేపుతోంది.
-----------------------
Admin