తాజా వార్తాలు / శ్రీకాకుళం జిల్లా : సేవా ఫౌండేషన్ ఆద్వర్యం లో జిల్లా అంధత్వ నివారణా సంస్థ సౌజన్యం తో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి వారిచే శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలో సేవా ఫౌండేషన్ గ్రంధాలయం వద్ద ఈ రోజు ఉదయం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యుడు తాజ్ మొయినుద్దీన్ ప్రారంభిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలను అందరూ ఉపయోగించుకుని ఆరోగ్యాన్ని పొందాలని అన్నారు. ఈ శిబిరానికి 102 మంది వచ్చి తమ కళ్ళను పరీక్ష చేయించుకున్నారు. అందులో 25 మందిని శస్త్ర చికిత్సకు ఎంపిక చేసి శంకర్ ఫౌండేషన్ బస్సులో విశాఖ తరలించడం జరిగింది. వృద్దులకు భోజన ఏర్పాట్లను పసుపురెడ్డి సురేష్ చేశారు.ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు ఇడదాసుల వెంకట సత్యన్నారాయణ,జడ్పీటీసీ సీతారాం, గ్రామ సర్పంచ్ బవిరి రమణ, మిండ్రాన రామారావు, టేకి బ్రహ్మాజీ,రాయపు రెడ్డి శ్రీనివాసరావు, మహాలక్ష్మునాయుడు, కునిబిల్లి సత్యారావు, చోడిశెట్టి చంద్రశేఖర్, పసుపురెడ్డి సురేష్, గెడ్డపు వరం, మహదాసు సూరిబాబు మింది ఆదినారాయణ మరియు శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
-----------------------
Admin