తాజా వార్తాలు / అమరావతి : ఇప్పటికే అనేక ఆరోపణలతో కేసులు, విచారణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సమయంలో కష్టాలు తప్పవనే వాదన వినిపిస్తుంది. ఐటీ నోటీసుల అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో వదిలిపెట్టేలా కనబడటం లేదు. రూ.118 కోట్ల నగదుకు సంబంధించి హవాలా రూపంలో ముడుపులు అందుకున్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఇక స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు లింక్ పెట్టి ముడుపుల కేసును కూడా విచారించాలని సీఐడి నిర్ణయం తీసుకోవడం కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగానే చెప్పవచ్చంటున్నారు రాజకీయ నేతలు.. కేసులో ఏం జరిగిందనే విషయం తేల్చడానికి కొంత సమయం పట్టినా.. ఎన్నికల ప్రచారంలో వైసీపీ మాత్రం అవినీతి అంశాన్ని ప్రచారాస్త్రాలుగా మార్చుకునే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉంది. మరి దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా అధిగమిస్తుందనేది చూడాలి.
-----------------------
Admin